కట్నం కూడా పరస్పర అంగీకారంతో ఇచ్చిపుచ్చుకునేదేగా?: స్మృతీ ఇరానీ
- ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన లోక్సభ
- ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి ఘాటు కౌంటర్
- ట్రిపుల్ తలాక్ ముమ్మాటికీ నేరమే
ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపక్షాలు విమర్శించడంపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చట్టాలు తేవడంలో విఫలమైందని ఆరోపించారు. పెళ్లిళ్ల సమయంలో కట్నం ఇవ్వడం ఆచారమని, ఇది రెండు కుటుంబాల మధ్య పరస్పర అంగీకారంతో జరుగుతుందని పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య పరస్పర అంగీకారంతో ఇది జరిగినప్పటికీ కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని చట్టం చెబుతుందని పేర్కొన్నారు. కాబట్టి తక్షణ ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని కూడా ‘ఖలీఫా’గానే చూడాలని స్పష్టం చేశారు. చట్టపరంగా ట్రిపుల్ తలాక్ చెప్పడం ముమ్మాటికీ తప్పేనని మంత్రి తేల్చిచెప్పారు.