తెలంగాణలో వణికిస్తున్న చలితో కరెంట్ కు తగ్గిపోయిన డిమాండ్!
- వ్యవసాయానికి 24 గంటల కరెంట్
- అయినా విద్యుత్ కు తగ్గిన డిమాండ్
- డిస్కంలకు ఆర్థిక వెసులుబాటు
విద్యుత్ కు డిమాండ్ తగ్గడంతో డిస్కంలకు ఆర్థికంగానూ వెసులుబాటు కలుగుతోందని తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ లోని మార్వా ప్లాంట్ల నుంచి తెలంగాణకు రోజుకు 1000 మెగావాట్ల విద్యుత్ రావాల్సి వుండగా, బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్లలోపే వస్తున్నా, విద్యుత్ కు కొరతలేదని అన్నారు. కాగా, నిన్న ఆదిలాబాద్ లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగి 19 డిగ్రీలకు చేరింది.