'మీటూ'పై ప్రశ్నకు అరవిందస్వామికి కోపం వచ్చేసింది!
- ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పొచ్చు
- అవకాశాన్ని పబ్లిసిటీ కోసం వాడకూడదు
- ఈ విషయంలో నా స్పందన అనవసరం
ఆ ప్రశ్నపట్ల ఆయన చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ .. "ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో వుంది. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే అవకాశం .. హక్కు రెండూ వున్నాయి. అయితే అవకాశాన్ని అడ్డు పెట్టుకుని పబ్లిసిటీని పొందాలని చూడకూడదు. ఒక వ్యక్తిపై ఆరోపణలు జరుగుతున్నప్పుడు .. తగినంత సమాచారం లేకుండా ఆ వ్యక్తిని నేను ఎలా తిట్టగలను? కేవలం ఒకరు చేస్తోన్న ఆరోపణలను ఆధారంగా చేసుకుని మరొకరిని నేను ఎలా నిందించగలను? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యక్తిగతమైన సమస్య .. దీనికి నా స్పందన అడగడం కూడా కరెక్ట్ కాదు" అని అన్నారు.