సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ కు మాతృ వియోగం

  • నిన్న అస్వస్థతకు గురైన రత్నాకర్ తల్లి మీనాక్షమ్మ
  • సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మీనాక్షమ్మ
పుట్టపర్తి సాయిబాబాకు చెందిన సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మీనాక్షమ్మ ఆనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. నిన్న ఆమె అస్వస్థతకు గురి కాగా... చికిత్స నిమిత్తం ఆమెను పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. దీంతో, పుట్టపర్తిలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం పుట్టపర్తిలోని రత్నాకర్ నివాసానికి తరలించారు.
Go Back to Shorts
satya sai trust
ratnakar
mother
dead
passes
puttaparthi

More Telugu News