ఓడిపోవడం బాధ కలిగించింది... ఇందులో టీడీపీ తప్పేం లేదు: జానారెడ్డి
- ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించక పోవడం ఆశ్చర్యం కలిగించింది
- అధికారంలోకి రావాలన్న బలమైన ఆకాంక్ష నెరవేరలేదని ఆవేదన
- టీఆర్ఎస్ అనైతిక పద్ధతుల్లో గెలిచిందన్న కుంతియా
ఓటమిపై అంశాల వారీగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అధికారాన్ని నిలబెట్టుకున్న కేసీఆర్ కు, గెలిచిన ఇతర ఎమ్మెల్యేలకు జానారెడ్డి అభినందనలు తెలిపారు. అయితే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు గ్రామాల్లో విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేసి కేసీఆర్ అనైతిక పద్ధతుల్లో గెలిచారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో వారి వాహనాల్లోనే డబ్బు తరలించారని విమర్శించారు.