కంటోన్మెంట్ లో గులాబీ జెండా రెపరెపలు.. ఘనవిజయం సాధించిన సాయన్న!
- 12 వేల మెజారిటీ సాధించిన సాయన్న
- 92 స్థానాల్లో ఆధిక్యంలో టీఆర్ఎస్
- మూడు స్థానాలు గెలుచుకున్న కారు
తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న 12,000 ఓట్లపై పైగా మెజారిటీతో విజయదుందుభి మోగించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 3 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ 92 స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. కాగా, చాంద్రాయణ గుట్ట నుంచి మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.