మొరాయించిన వందల కొద్దీ ఈవీఎంలు... వెనుదిరుగుతున్న ఓటర్లు!
- 229 కేంద్రాల్లో ఈవీఎం సమస్యలు
- ఇళ్లకు వెళ్లిపోతున్న ఓటర్లు
- ఈసీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కాగా, ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీఈఓ రజత్ కుమార్, నిర్ణీత సమయానికే ఓటింగ్ ప్రారంభమైందని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్టు ఫిర్యాదులు ఇప్పటివరకూ రాలేదని చెప్పారు. ఈవీఎంలు మొరాయించాయన్న ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించామని తెలిపారు. ఎక్కడా ఓటర్లు వెనుదిరిగినట్టు తన దృష్టికి రాలేదని అన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనివార్య పరిస్థితులు ఏర్పడి, అసలు పోలింగ్ జరుగకుంటే ఆ ప్రాంతాల్లో ఆదివారం నాడు పోలింగ్ ఉంటుందని అన్నారు.