కేసీఆర్ ని ఓడించి తెలంగాణను కాపాడుకోవాలి: చంద్రబాబు పిలుపు

  • ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలి
  • హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీయే
  • ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చా
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. కూకట్ పల్లిలోని సుజనా ఫోరం మాల్ వద్ద నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించి, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.


హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. నాడు హైదరాబాద్ అభివృద్ధి కోసం తాను ఎంతో శ్రమించానని, ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డానని అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అమెరికాలో బిల్ గేట్స్ చుట్టూ తిరిగానని గుర్తుచేసుకున్నారు. దేశంలోకి సెల్ ఫోన్లు రావడానికి కారణం తానేనని, వాజ్ పేయితో పోరాడి జాతీయ రహదారులను తీసుకువచ్చానని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
kcr
Chandrababu
kukatpally
road show

More Telugu News