పార్టీని మోసం చేసిన వ్యక్తులను చిత్తుచిత్తుగా ఓడించండి: నిజాంపేటలో సీఎం చంద్రబాబు

  • ‘గాంధీ’ అని పేరు ఎలా పెట్టుకున్నాడో!
  • అసలు సిసలైన నకిలీ గాంధీ
  • పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులను గెలవనివ్వొద్దు
పార్టీని మోసం చేసి పోయిన అరికెపూడి గాంధీని చిత్తుగా ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులను గెలవనివ్వొద్దని సూచించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 78 వేల మెజార్టీతో గాంధీని గెలిపిస్తే, పార్టీని మోసం చేసి పోయాడని నిప్పులు చెరిగారు.

‘‘గాంధీ’ అని పేరు ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అసలు సిసలైన నకిలీ గాంధీ’ అని విమర్శించారు. కుత్బుల్లాపూర్ టీడీపీ టికెట్ పై గెలిచిన మరో నాయకుడు కూడా పార్టీని వీడి పోయారని, ఆయన్ని కూడా చిత్తుచిత్తుగా ఓడించాలని, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని అన్నారు. అక్కడ పెద్ద మోదీ, ఇక్కడ చిన్న మోదీ (కేసీఆర్) కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని, వీళ్ల గురించి రాయాలంటే మీడియా భయపడుతోందని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
aarikepudi gandhi
nizampet
road show

More Telugu News