డిసెంబరు 10 తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసన సభ శీతాకాల సమావేశాలు
- రెండు రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం
- చంద్రబాబు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చాక దీనిపై తుది నిర్ణయం
- ఈ సమావేశాల్లోనే శాసన మండలి చైర్మన్ ఎన్నిక
బీజేపీయేతర పక్షాల సమావేశం డిసెంబరు 10వ తేదీన ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ఈ సమావేశం పూర్తయి బాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక సమావేశాల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాసన మండలి చైర్మన్గా పనిచేసిన ఎన్.ఎం.డి.ఫరూక్ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అందువల్ల ఈ ఎన్నికల్లోనే మండలి చైర్మన్ ఎన్నిక కూడా జరగాల్సి ఉంది.