జగన్ పై హత్యాయత్నం కేసు.. పలువురికి నోటీసులు జారీచేసిన హైకోర్టు!
- కేంద్ర, ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులకు నోటీసులు
- రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశం
- ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయించిన జగన్
రెండు వారాల్లోగా ఈ విషయమై తమ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పోలీసులు జరిపిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన నిన్న ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు.