Chandrababu: చంద్రబాబును కలిసి రూ. 25 లక్షల చెక్కును అందించిన బాలయ్య
తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ రూ. 25 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి బాలయ్య వెళ్లారు. అనంతరం తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.