తొలుత విజయవాడ ఆపై తిరుపతి.. నేడు చంద్రబాబు పర్యటన వివరాలు!

  • ప్రకృతి సేద్యంపై రైతన్నలతో ముఖాముఖి
  • అనంతరం శ్రీసిటీ సెజ్ లో డిక్సన్ కంపెనీ ప్రారంభం
  • షియోమీ టీవీని ఆవిష్కరించనున్న బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ, తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు రైతులతో సమావేశం అవుతారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో చంద్రబాబు ముఖాముఖి భేటీ అయి ఈ రకమైన వ్యవసాయంపై వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుంటారు. అనంతరం తిరుపతికి బయలుదేరుతారు.

తిరుపతిలో సమీపంలోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన డిక్సన్ కంపెనీని చంద్రబాబు ప్రారంభిస్తారు. శామ్ సంగ్, షియోమీ, సోనీ, ప్యానసోనిక్ కంపెనీలకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ కంపెనీ తయారుచేస్తోంది. అలాగే టీవీలు, సీసీటీవీల తయారీలోనూ డిక్సన్ కంపెనీకి మంచి పేరుంది. తొలిదశలో భాగంగా ఈ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మంది యువతకు ఉపాధిని కల్పించింది.

త్వరలోనే రెండోదశలో భాగంగా మరో 700 మందికి కంపెనీ ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే షియోమీ కంపెనీ తయారుచేస్తున్న ఎంఐ టీవీని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరుతారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Tirupati
amaravati
Vijayawada
tour
mi
dickson company
sri city sez

More Telugu News