police: పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు...ముగ్గురు మావోల మృతి

  • ముల్లేరు అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్
  • పోలీసుల అదుపులో ఐదుగురు మావోలు
  • మావోల కోసం వేటను ముమ్మరం చేసిన పోలీసులు

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల అదుపులో మరో ఐదుగురు మావోలు ఉన్నట్టు సమాచారం. ఎన్ కౌంటర్ సందర్భంగా ఘటనాస్థలంలో మావోలకు చెందిన ఓ రైఫిల్, పైప్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ముల్లేరు అటవీప్రాంతం, మర్కగూడాలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. 

More Telugu News