గౌరీ లంకేశ్ హత్య కేసు..సిట్ పై నిందితుల తీవ్ర ఆరోపణలు
- ఈ నేరం ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి చేశారు
- రూ.25 లక్షలు ఇచ్చి నేరం ఒప్పుకోమన్నారు
- కుటుంబాన్ని బెదిరించి తనతో ఈ నేరం ఒప్పించారు
- నిందితులు పరశురామ్, మనోహర్
మనోహర్ మాట్లాడుతూ, గౌరీ లంకేశ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ, తనను, తన కుటుంబాన్ని బెదిరించి తనతో ఈ నేరం ఒప్పించారని ఆరోపించారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 5న గౌరీ లంకేశ్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 14 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.