గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసులో శిక్ష అనుభవించిన మహ్మద్‌ బారీతో ప్రణయ్ హత్యకు మాస్టర్ ప్లాన్!

  • పరువుహత్య కేసులో సంచలన నిజాలు
  • మహ్మద్ బారీతో ఐదేళ్ల క్రితం మారుతీరావుకు పరిచయం
  • హత్యకు సహకరించాలని భారీగా డబ్బు
మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ పరువుహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ ని హత్య చేయించేందుకు నిర్ణయించుకున్న మారుతీరావు, గుజరాత్ మాజీ హోమ్ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో జైలు శిక్షను అనుభవించి విడుదలైన ఉగ్రవాది మహ్మద్ బారీతో కలసి డీల్ కుదుర్చుకున్నాడు. నల్గొండకు చెందిన మహ్మద్ బారీకి కాంగ్రెస్ పార్టీ నేత ఎండీ కరీమ్ ఆశ్రయం ఇచ్చాడు. ప్రస్తుతం బారీ హైదరాబాద్ లో ఉంటుండగా, కరీమ్ ఇచ్చిన ఆఫర్ తో పాతబస్తీకి చెందిన ఓ రౌడీషీటర్ తో ఈ హత్యను బారీ చేయించాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

ఐదారేళ్ల క్రితం భూ కబ్జా వివాదంలో బారీ మిర్యాలగూడకు వచ్చిన వేళ, మారుతీరావు కలుగజేసుకుని సయోధ్య చేశాడని, అప్పటి పరిచయమే, ఈ హత్యకు అతని సాయాన్ని కోరేలా చేసిందని పోలీసులు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసిన తరువాత బారీకి కరీమ్ ఆశ్రయం ఇచ్చాడని, డబ్బులు కూడా కరీమ్ ద్వారానే బారీకి అందాయని, వీరితో పాటు రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Miryalaguda
Honor Killing
Marutirao
mahmad bari

More Telugu News