సుప్రీంకోర్టు మనదే.. రామమందిరం కట్టేస్తాం!: యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- మీడియా సమావేశంలో మంత్రి వర్మ
- సుప్రీంకోర్టు తమదేనని వ్యాఖ్య
- నెటిజన్ల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన మంత్రి
‘అయోధ్యలో రామమందిర నిర్మాణం కచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు మనదే’ అని మంత్రి వర్మ వ్యాఖ్యానించారు. దీంతో సుప్రీంకోర్టుకు మతం రంగు పులమడం ఏమిటని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో శర్మ వెనక్కి తగ్గారు. ‘సుప్రీం కోర్టు మనదే అని చెప్పడం అర్ధం భారతీయులందరిది అని చెప్పడమే. సుప్రీంకోర్టుపై మాకందరికీ పూర్తి నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.