కొండా దంపతులు టికెట్ కోసం కేసీఆర్ ను ఇంటికొచ్చి బ్రతిమాలారు!: టీఆర్ఎస్ నేత వినయ్
- కేసీఆర్ పెద్ద మనసుతో పార్టీ టికెట్ ఇచ్చారు
- టీఆర్ఎస్ లో చేరాక వీరి వ్యవహారశైలి మారింది
- కొండా మురళి వెంటనే రాజీనామా చేయాలి
కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీతో రహస్య అజెండా ఉందనీ, ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే చెప్పారని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను అడ్డు పెట్టుకుని కొండా దంపతులు ఎంతో లబ్ధి పొందారని ఆరోపించారు. కొండా సురేఖ, మురళీ వంటి అవకాశవాదులకు టీఆర్ఎస్ లో స్థానం లేదనీ, మురళీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరిద్దరికి కేసీఆర్ పెద్ద మనసుతో రాజకీయ జీవితం ప్రసాదించారని వినయ్ అన్నారు.