Deepika Padukone: ‘ట్రిపుల్ ఎక్స్’ సీక్వెల్ లో దీపికకు ఛాన్స్!

  • విన్ డీజిల్ తో జోడీ కట్టిన దీపిక
  • సీక్వెల్ తీసేందుకు దర్శకుడు రెడీ
  • ట్విట్టర్ లో స్పందించిన డైరెక్టర్ కరుసో

‘ట్రిపుల్ ఎక్స్ : ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ చిత్రంతో పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే హాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు విన్ డీజిల్, డానీ యెన్, రూబీ రోస్ తదితరులు నటించారు. కేవలం 85 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 346 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్లు దర్శకుడు డీజే కరుసో గతంలోనే తెలిపాడు.

అయితే నటీనటుల ఎంపికపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. తాజాగా ఈ విషయమై కరుసో ట్విట్టర్ లో స్పందించాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో వస్తున్న ఈ సినిమాలో చైనా నటుడు రాయ్ వాంగ్ నటిస్తున్నట్లు కరుసో ప్రకటించాడు. మరి ఈ సినిమాలో దీపిక నటిస్తుందా? అంటే ‘అవును’ అని జవాబిచ్చాడు. పద్మావతి చిత్రం తర్వాత దీపిక ఇప్పటివరకూ ఏ సినిమాను అంగీకరించని సంగతి తెలిసిందే.

More Telugu News