ఔటర్ రింగ్ రోడ్డు లేకుంటే... హైదరాబాద్ స్తంభించిపోయేది!
- హైదరాబాద్ లో ఇప్పటికే 80 లక్షల మంది
- అదనంగా 20 లక్షల మంది వచ్చి చేరితే అస్తవ్యస్తం
- 80 వేల వాహనాలను నగరంలోకి రాకుండా చేసిన ఓఆర్ఆర్
నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ జరిగిన వేళ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ కు వాహనాలు బారులు తీరాయి. అయితే, సభకు వచ్చే ఏ వాహనాన్నీ నగరంలోకి అనుమతించకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంతో హైదరాబాద్ లో సాధారణ ట్రాఫిక్ కు అంతరాయాలు ఏర్పడలేదు. ఇదే సభ ఔటర్ ఏర్పడక ముందు జరిగుంటే, ఇటు పటాన్ చెరువు నుంచి, అటు టోలీచౌకీ నుంచి, మరోవైపు ఉప్పల్ నుంచి వచ్చిన వాహనాలతో హైదరాబాద్ గ్రిడ్ లాక్ అయ్యుండేది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పోలీసులు, ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో ఉపకరించిందని అంటున్నారు.