vajpayee: వాజ్ పేయికి ఇస్తున్న గౌరవం నాకు దక్కుతుందంటే ఈ రోజే చచ్చిపోతా!: సమాజ్ వాదీ నేత వ్యాఖ్య

  • అస్థికల నిమజ్జనంపై అజాంఖాన్ స్పందన
  • బీజేపీ నేతల హడావుడిపై వ్యంగ్యాస్త్రాలు
  • ఈ నెల 16న కన్నుమూసిన అటల్

మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి అస్థికలను దేశంలోని అన్ని నదుల్లో కలపటానికి బీజేపీ నేతలు చేస్తున్న హడావుడిపై ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత వ్యంగ్యంగా స్పందించారు. ఎవరైనా తనకు ఈ స్థాయిలో గౌరవం ఇస్తానంటే ఇప్పుడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అజాం ఖాన్ వ్యాఖ్యానించారు.

దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడిన వాజ్ పేయి ఈ నెల 16న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాజ్ పేయి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఈ సందర్భంగా వాజ్ పేయి అస్థికలను దేశంలోని అన్ని పవిత్ర నదుల్లో కలపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

More Telugu News