కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్!
- కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలి
- మా ప్రార్థనలన్నీ వారి కోసమే
- అవసరమనుకుంటే సాయానికి రెడీ
కేరళలో వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక శిబిరాల్లో ఉన్నవారు నెమ్మదిగా ఇళ్లకు తరలివస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నీళ్లు తదితర వాటిని పంపిణీ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు పంపించిన మందులు, ఆహారం, దుస్తులు ఇప్పటికే కేరళ చేరుకున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పనిచేస్తున్నాయి.