వరద బాధితులను గుర్తించేందుకు డ్రోన్ల సాయం!
- నిరాశ్రయులను, జాడ తెలీని వారిని గుర్తించేందుకు డ్రోన్ల వినియోగం
- కర్నాటక రాష్ట్రం కొడగు జిల్లాలో రంగంలోకి 8 డ్రోన్లు
- ఆహారాన్ని, సహాయసామాగ్రిని జారవిడిచే విధంగా తయారీ
జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సుశిక్షితులైన యువకుల బృందం కూడా రంగంలోకి దిగింది. తామున్న ప్రాంతాల సమాచారాన్ని, అక్కడ అవసరాలను సహాయక సిబ్బందికి చేరవేయడంలో శిక్షణ పొందిన వీరు ఫ్లయింగ్ డ్రోన్ల సాయంతో బాధితులను గుర్తించి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. 25 కిలోమీటర్ల మేర ప్రయాణించగలిగే ఈ డ్రోన్లను వరద బాధితులకు ఆహార పదార్ధాలను తీసుకెళ్లే విధంగానూ, తేలికపాటి మందులు, సహాయ సామగ్రిని పైనుంచి జారవిడిచే విధంగానూ రూపొందించారు. సిబ్బంది వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వీటితో సహాయం అందించే వీలుంది.