ఆర్టికల్ 35ఏను తాకితే కశ్మీర్ లో రణరంగమే.. హెచ్చరించిన నిఘా వర్గాలు!
- పోలీసులు సైతం తిరుగుబాటు చేస్తారని హెచ్చరిక
- అక్టోబర్ వరకు విచారణ వద్దని సుప్రీంను కోరిన గవర్నర్
- పిటిషన్ దాఖలు చేసిన ఎన్జీవో
భారత రాజ్యాంగం ప్రకారం పౌరులు దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చని కోర్టులో వాదించింది. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఒకవేళ ఆర్టికల్ 35ఏ ను న్యాయస్థానం కొట్టేస్తే.. కశ్మీర్ లో ఇన్నాళ్లు ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లకు అండగా ఉన్న పోలీసులు సైతం తిరుగుబాటు చేస్తారని నిఘా వర్గాలు చెప్పాయి. దీంతో ఈ విషయంలో విచారణను అక్టోబర్ లో పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవరకూ నిలిపివేయాలని సుప్రీంకోర్టుకు జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు సుప్రీంకోర్టులో సోమవారం జరగనున్న విచారణను నిరసిస్తూ కశ్మీర్ లో వేర్పాటువాదులు, నేతలు ఈ రోజు, రేపు బంద్ కు పిలుపునిచ్చారు.