సెల్ టవర్ ఎక్కిన అమ్మాయి కేసు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం!
- యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో ఘటన
- నిన్న ఆందోళన చేసిన యువతి
- పీఎస్లో ఆమె ప్రియుడితో సంప్రదింపులు జరిపిన పోలీసులు
- ఈరోజు ఇంటికెళ్లి పురుగుల మందు తాగిన ప్రియుడు
ఆమెకు నచ్చజెప్పిన పోలీసులు సెల్టవర్ నుంచి కిందకు దింపి, ఆమె ప్రియుడు భాస్కర్ను వలిగొండ పోలీస్ స్టేషన్కు పిలిపించి పెళ్లి చేసుకోవాలని చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకోనని చెప్పి ఇంటికి వెళ్లిన భాస్కర్.. ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.