mehabooba mufti: పీడీపీని ముక్కలు చేయాలనుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: బీజేపీని హెచ్చరించిన మెహబూబా ముఫ్తీ

షార్ట్స్‌లో చూడండి
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీని ముక్కలు చేసేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పీడీపీతో కలసి జమ్ముకశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... ఇటీవలే ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. మరోవైపు, పీడీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మెహబూబా ముఫ్తీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీడీపీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తే... భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పోతుందని మెహబూబా అన్నారు.  
Go Back to Shorts
mehabooba mufti
bjp
pdp
Jammu And Kashmir

More Telugu News