కత్తి మహేశ్, పరిపూర్ణానంద బహిష్కరణ అందుకేనా?
- శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు
- కేసీఆర్ ఆదేశాల మేరకే నగర బహిష్కరణ
- సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తే కఠిన శిక్ష
రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో మత ఘర్షణలకు ఊతమిచ్చే ఘటనపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. మత సామరస్యాన్ని దెబ్బతీసే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు. మతం పేరిట ఘర్షణలు, రాజకీయాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందులో భాగంగానే వీరిద్దరినీ నగరం నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది.