ఐదో రోజుకు చేరిన దీక్ష... క్షీణిస్తున్న సీఎం రమేష్ ఆరోగ్యం!

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరగా, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు వెల్లడించారు. ఈ ఉదయం సీఎం రమేష్, ఆయనతో పాటు దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ బీటెక్ రవిలను పరీక్షించిన కడప రిమ్స్ వైద్య బృందం, వారు చాలా నీరసంగా ఉన్నారని, షుగర్ లెవల్స్ తగ్గాయని, బీపీ కూడా తగ్గుతోందని తెలిపారు.

కాగా, రమేష్ దీక్షకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం ఎమ్మెల్యేలు బొండా ఉమ, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు కడపకు వచ్చి రమేష్, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు దీక్షాస్థలికి వచ్చి రమేష్ ను పరామర్శించారు.
Go Back to Shorts
Kadapa District
Steel Plant
CM Ramesh
Ravi
Hunger Strike

More Telugu News