ఆమరణ దీక్షకు దిగుతా: మోదీకి లేఖ రాసిన సీఎం రమేష్
- కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయండి
- మేకాన్ సంస్థ నివేదికను పరిశీలించండి
- చర్యలు చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తా
కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంటులను ఏర్పాటు చేయడం సాధ్యపడదని పేర్కొంటూ సెయిల్ ఇచ్చిన నివేదికతో పాటు అఫిడవిట్ ను ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రజల హక్కు అని... దాన్ని సాధించడం కోసం నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధానికి ఆయన లేఖ రాశారు.