Karnataka: కుమారస్వామికి మోదీ విసిరిన ఫిట్ నెస్ సవాల్ పై దేవెగౌడ స్పందన

  • వ్యాయామం నా దైనందిన జీవితంలో ముఖ్యభాగమై పోయింది
  • మితాహారం తీసుకుంటా.. మద్యం,ధూమపానం అలవాట్లు లేవు
  • తెల్లవారుజామునే నిద్ర లేస్తా.. నేను శాకాహారిని

కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం ఫిట్ నెస్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, కుమారస్వామికి  కొంత కాలం క్రితం గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరగడంతో ఈ సవాల్ పై ఆయన స్పందించలేదు.కానీ, కుమారస్వామి గౌడ తండ్రి దేవెగౌడ స్పందించారు. ఎనభై ఆరేళ్ల వయసులో దేవెగౌడ చేస్తున్న వ్యాయామాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.  ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తా 

80 ల నాటికి ముందే తాను వ్యాయామం చేయడం మొదలు పెట్టానని ఈ సందర్భంగా దేవెగౌడ అన్నారు. వ్యాయామం తన దైనందిన జీవితంలో ముఖ్యభాగమై పోయిందని అన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పిన దేవెగౌడ, మితాహారం తీసుకుంటానని, మద్యం, ధూమపానం అలవాట్లు లేవని చెప్పారు. తాను శాకాహారినని, తెల్లవారుజామునే నిద్ర లేస్తానని, ఎలాంటి ఒత్తిళ్లు పెట్టుకోనని అన్నారు.
దేవెగౌడలో ఎంతో ఎనర్జీ ఉంది
ప్రతిరోజు ఆయన గంటపాటు కఠిన వ్యాయామం చేస్తారని, అయినా ఏమాత్రం అలసిపోరని దేవెగౌడ వ్యాయామ శిక్షకుడు కార్తీక్ అన్నారు. దేవెగౌడలో ఎంతో ఎనర్జీ ఉంది. త్రెడ్ మిల్, వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్ మొదలై వ్యాయామాలు చేస్తుంటారు.

More Telugu News