తిరుమలలో ఏ మాత్రమూ తగ్గని రద్దీ... నేడు క్యూలైన్ లోకి వెళితే రేపే స్వామి దర్శనం!

  • స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్న 60 వేల మంది
  • దర్శనానికి 22 గంటల సమయం
  • కాలినడక భక్తులకు 5 గంటల సమయం
ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చి, తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమైనా తిరుమలలో మాత్రం భక్తుల రద్దీ తగ్గలేదు. దాదాపు 60 వేల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఈ ఉదయం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లే భక్తులకు 22 గంటల తరువాత దర్శనం కల్పిస్తామని టీడీపీ అధికారులు తెలిపారు.

 టైమ్ స్లాట్ టోకెన్ తీసుకోవాలని భావిస్తే, రేపు ఉదయం 8 గంటల సమయంలో క్యూ లైన్ లోకి రావాలని సూచిస్తూ, సమయాన్ని కేటాయిస్తున్నారు. కాలినడక భక్తులకు 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో ఉన్న వారికి అన్న పానీయాలకు లోటు రాకుండా చూస్తున్నామని తెలిపిన అధికారులు, ఈ రద్దీ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, శనివారం నాడు స్వామివారిని 95 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims
Summer Holidays

More Telugu News