Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పారిస్ లో 'తేజ్ ఐ లవ్ యూ' పాటలు
  • అమలాపురం వెళుతున్న నితిన్ 
  • రజనీకాంత్ సరసన సిమ్రన్ 
  • మరో తెలుగు సినిమాలో మాధవన్

 *  సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ రూపొందిస్తున్న 'తేజ్.. ఐ లవ్ యూ ' చిత్రానికి సంబంధించిన రెండు పాటలను ఇటీవల పారిస్ లో చిత్రీకరించారు. దీంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు.
*  నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'శ్రీనివాస కల్యాణం' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జూన్ ఒకటి నుంచి తిరిగి అమలాపురంలో జరుగుతుంది. ఇరవై రోజుల పాటు జరిగే ఆ షూటింగ్ తో మొత్తం పూర్తవుతుంది. రాశిఖన్నా, నందిత శ్వేత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నిన్నటి తరం నాయిక సిమ్రన్ జతకట్టనుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ఓ చిత్రం చేస్తున్న సంగతి విదితమే. ఇందులో రజనీ సరసన ఓ నాయికగా సిమ్రన్ నటించనున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళ నటుడు మాధవన్ తాజాగా మరో తెలుగు చిత్రాన్ని అంగీకరించినట్టు సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించే థ్రిల్లర్ మూవీలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తాడట.   

More Telugu News