srinivas: 'సాక్ష్యం' సినిమా ఆడియో ఫంక్షన్ కి ప్రత్యేక అతిథిగా పవన్

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  • శ్రీనివాస్ జోడిగా పూజా హెగ్డే 
  • ఈ నెల 26న ఆడియో ఫంక్షన్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా ఈ సినిమా ఆడియో వేడుకను జరపాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారట. తప్పకుండా వస్తానని ఆయన చెప్పినట్టుగా సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా తనకి భారీ విజయాన్ని అందిస్తుందనే బలమైన నమ్మకంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్టుగా సమాచారం.   

More Telugu News