Chandrababu: యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించండి.. గోదావరిలో లాంచీ మునకపై చంద్రబాబు ఆదేశాలు!
కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా దేవీపట్నం వద్ద గోదావరిలో ఓ లాంచీ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందజేయాలని తూర్పుగోదావరి జిల్లా అధికారులతో చంద్రబాబు అన్నారు. కాగా, బలమైన ఈదురుగాలుల వల్లే లాంచీ మునిగిందని, ఆ సమయంలో అందులో 20 మంది ఉన్నారని అధికారులు అంటున్నారు.
బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందజేయాలని తూర్పుగోదావరి జిల్లా అధికారులతో చంద్రబాబు అన్నారు. కాగా, బలమైన ఈదురుగాలుల వల్లే లాంచీ మునిగిందని, ఆ సమయంలో అందులో 20 మంది ఉన్నారని అధికారులు అంటున్నారు.