కర్ణాటకం... సాధారణ మెజారిటీకి ఒకే ఒక్క అడుగు దూరంలో బీజేపీ!

  • 111 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • 61 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
  • ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళుతున్న బీజేపీ
222 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 112 స్థానాల్లో విజయం తప్పనిసరికాగా, ఆ మార్కును భారతీయ జనతా పార్టీ అందుకునేందుకు పరుగులు పెడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ట్రెండ్స్ వస్తుండగా, ప్రస్తుతం బీజేపీ 111 చోట్ల ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 61 స్థానాలకు పరిమితం అయింది. జేడీఎస్ అనుకున్నదానికన్నా మెరుగైన ఫలితాలను నమోదు చేస్తూ 48 చోట్ల ఆధిక్యంలో ఉంది.

తొలి దశలో హోరాహోరీగా సాగుతున్నాయని భావించిన ఎన్నికలు, ఆపై నెమ్మదిగా బీజేపీ వైపు మొగ్గు చూపాయి. మైసూరు మినహా ప్రతి జిల్లాలో బీజేపీ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ సాగుతోంది. తీర్దహళ్ళిలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేంద్ర, మంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి యుటి ఖాదర్ గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Go Back to Shorts
BJP
Congress
Karnataka
Elections

More Telugu News