వైసీపీ అధినేత జగన్ ఏం చేస్తే చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు!: విష్ణుకుమార్ రాజు

  • రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది
  • ఇతర రాష్ట్రాలకు హోదా ఇచ్చారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • 2019 ఎన్నికల్లో టీడీపీ పతనం ఖాయం
బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏం చేస్తే చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారని సెటైర్లు వేశారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు హోదా ఇచ్చారని చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా ఆరోపించారు. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పతనం ఖాయమని అన్నారు.
Go Back to Shorts
YSRCP
BJP
Telugudesam
Andhra Pradesh
Jagan
Chandrababu
vishnu kumar raju

More Telugu News