disco shanthi: అది డాక్టర్స్ తప్పే .. అందుకే శ్రీహరి చనిపోయాడు: డిస్కో శాంతి

  • శ్రీహరి జ్వరంతో హాస్పిటల్లో చేరారు
  • మధ్యాహ్నం వరకూ మాతో మాట్లాడారు 
  • ఆ తరువాత మాట సరిగ్గా రాలేదు      

శ్రీహరి  .. డిస్కో శాంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. అన్యోన్య దంపతులు అనిపించుకున్నారు. శ్రీహరి హఠాత్తుగా మరణించడంతో, ఆయన జ్ఞాపకాలతో డిస్కో శాంతి ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. శ్రీహరి చివరి రోజును గురించి ప్రస్తావించారు. "డాక్టర్స్ చెప్పినట్టుగా చనిపోయిన రోజుకి శ్రీహరికి జాండీస్ వ్యాధి ఎక్కువగా ఏమీ లేదు .. ఆయనకి హార్ట్ ఎటాక్ రాలేదు. కేవలం ముంబై హాస్పిటల్ రాంగ్ ట్రీట్మెంట్ వల్లనే అయన చనిపోయాడు"

 "జ్వరం రావడం వల్లనే ఆయన హాస్పిటల్ కి వెళ్లాడు. హాస్పిటల్లో చేరిన రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఆయన నాతోనూ .. పిల్లలతోను మాట్లాడుతూనే వున్నారు. అంతలో నాలుక మడత పడినట్టుగా మాటలు ముద్దముద్దగా రావడం మొదలైంది. నేను గట్టిగా పిలవడంతో నర్సులు పరిగెత్తుకు వచ్చారు .. ఆ తరువాత శ్రీహరిని చూస్తే ముక్కులో నుంచి .. చెవుల్లో నుంచి బ్లడ్ వస్తోంది. దాంతో నన్ను అక్కడి నుంచి పంపించి వేశారు. మా బంధువులు హాస్పిటల్ కి వచ్చారు .. శ్రీహరి చనిపోయిన విషయాన్ని ఆ రోజు రాత్రి వరకూ నాకు చెప్పకుండా దాచారు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News