డేటా ప్రియుల కోసం ఎయిర్ టెల్ నుంచి సరికొత్త పథకం!
- రూ.499కే రోజూ 2జీబీ డేటా
- 82 రోజుల పాటు వ్యాలిడిటీ
- కాల్స్, ఎస్ఎంఎస్ లు ఉచితమే
దీంతో ఎయిర్ టెల్ కూడా రూ.499 పథకంతో ముందుకు వచ్చింది. ఈ ప్యాక్ ద్వారా యూజర్లు ఎటువంటి ఆటంకాల్లేకుండా మ్యాచ్ లు వీక్షించొచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ పథకంలో అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే, రోజులో 300 నిమిషాలు, వారంలో 1,000 నిమిషాల పరిమితి ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. రూ.499 ప్లాన్ లో 82 రోజుల పాటు రోజూ 2 జీబీ డేటా అంటే మొత్తం 164 జీబీ డేటాను పొందొచ్చు.