Chandrababu: చంద్రబాబుకు వైసీపీ నేత పార్థసారథి సవాల్

దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ నేత పార్థసారథి సవాల్ విసిరారు. హోదాపై జరుగుతున్న ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేద్దామని తాము పిలుపునిస్తుంటే... చంద్రబాబు కలసి రావడం లేదని విమర్శించారు.

తనపై నమోదైన కేసుల్లో విచారణ జరుపుతారేమోననే భయం చంద్రబాబుకు పట్టుకుందని... అందుకే హోదాపై పోరాటంలో ఆయన వెనకడుగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామాలతోనే టీఆర్ఎస్ నేతలు తెలంగాణను సాధించుకున్నారని పార్థసారథి చెప్పారు. ఇప్పటికైనా మోసాలు, కపట నాటకాలను చంద్రబాబు ఆపాలని అన్నారు. ఇన్నాళ్లపాటు చంద్రబాబు ప్యాకేజీ జపం చేశారని... జగన్ చేస్తున్న పోరాటాలను చూసి, యూటర్న్ తీసుకున్నారని... ఇప్పుడు ప్రత్యేక హోదా జపం చేస్తున్నారని విమర్శించారు. 
Chandrababu
parthasarathi
Special Category Status

More Telugu News