Venkaiah Naidu: ఏపీ అంశంపై వెంకయ్య నాయుడితో కేంద్ర మంత్రుల కీలక చర్చ

  • రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్‌లో సమావేశం
  • ఏపీలో పెండింగ్‌లో ఉన్న కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలపై చర్చ
  • హాజరైన కేంద్ర మంత్రులు జవదేకర్, అనంత కుమార్, ఎంపీలు కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి
  • రెండు వర్సిటీలపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నాలు  

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడి ఛాంబర్‌లో ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల అంశంపై కీలక సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్‌లో ఉన్న కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలపై కేంద్ర మంత్రులు జవదేకర్, అనంత కుమార్, ఎంపీలు కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి వెంకయ్య నాయుడితో చర్చిస్తున్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి, అలాగే గిరిజన వర్సిటీ బిల్లుపై న్యాయశాఖ కార్యదర్శితో వెంకయ్య నాయుడు మాట్లాడారు.

న్యాయశాఖ వద్ద ఉన్న వర్సిటీ బిల్లులు పార్లమెంటుకు చేరేలా చూడాలని వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటులో పెండింగ్ కాకుండా చూడాలని అనంతకుమార్‌ను వెంకయ్య నాయుడు కోరారు. ఈ సందర్భంగా రెండు వర్సిటీలపై కేబినెట్ ఆమోదానికి చర్యలు తీసుకుంటున్నట్లు జవదేకర్ వెంకయ్య నాయుడికి తెలిపారు. 

More Telugu News