sbi: ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకున్న వారిపై భారం... లెండింగ్ రేటును పెంచిన బ్యాంకు

షార్ట్స్‌లో చూడండి
రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్ దారులను మురిపించిన ఎస్బీఐ ఒక్కరోజు తిరగకుండానే రుణగ్రహీతలపై భారం మోపింది. రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లకు ప్రామాణికమైన ఎంసీఎల్ఆర్ ను పెంచుతూ ఈ రోజు నిర్ణయం ప్రకటించింది. ఈ రోజు నుంచే పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి.

 దీంతో ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారితోపాటు కొత్తగా రుణాలు తీసుకోబోయే వారు మరికాస్త అధికంగా ఈఎంఐ చెల్లించుకోవాల్సి ఉంటుంది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా, ఈ విధానంలో రుణాలపై వడ్డీ రేట్లను ఎస్ బీఐ పెంచడం ఇదే ప్రథమం. ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్ ను 7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు అరశాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 
Go Back to Shorts
sbi
lending rate
loans

More Telugu News