కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం!: పంజాబ్ నేషనల్ బ్యాంక్

  • మా బ్రాండ్ అంబాసడర్ గా కోహ్లీ కొనసాగుతాడు
  • నగదు ఉపసంహరణపై పరిమితి విధించలేదు
  • మా గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం
సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నీరవ్ బ్రాండ్ కు ప్రచారకర్త అయిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా... ఆ బ్రాండ్ తో తెగదెంపులు చేసుకుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో, బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరాట్ ముగింపు పలకబోతున్నాడనే కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పందించింది. తమ బ్రాండ్ అంబాసడర్ గా కోహ్లీ కొనసాగుతాడని... అతనిని వదులుకోబోమని ఓ ప్రకటనలో తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే పరిమితిని తగ్గించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా అవాస్తవమేనని పేర్కొంది.
Go Back to Shorts
Virat Kohli
punjab national bank
brand ambassador
agreement

More Telugu News