సీసీఎస్ విచారణకు హాజరైన వర్మ.. అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది ఆయనపైనే ఆధారపడి ఉంటుందన్న సైబర్ క్రైమ్ డీసీపీ
- జీఎస్టీ చిత్రానికి సంబంధించి వర్మపై కేసు
- విచారణకు అడ్వొకేట్ తో కలసి హాజరైన వర్మ
- పూర్తి స్థాయిలో విచారిస్తామన్న సైబర్ క్రైమ్ డీసీపీ
దీనికి ముందు... ఓ టీవీ ఛానల్ తో సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ, వర్మను పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పారు. అందరిలాగానే సామాన్య నిందితుడిగానే వర్మను పరిగణిస్తామని... చట్టం దృష్టిలో అందరూ సమానమే అని తెలిపారు. జీఎస్టీ సినిమాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మహిళలను కించపరిచేలా మాట్లాడారనే దానికి సంబంధించి మరొక ఎఫ్ఐఆర్ ఆయనపై నమోదయ్యాయని... వీటన్నింటిపై విచారణ జరుగుతుందని అన్నారు. దాదాపు 4 గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పారు. జీఎస్టీ సినిమాను ఎందుకు తీశారో ఆయన సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.