మొరం విషాద ఘటనపై రఘువీరారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
- హేచరీస్ కంపెనీకి చెందిన డ్రైనేజీలోకి దిగి ఏడుగురు మృత్యువాత
- బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి
బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, పౌల్ట్రీ ఉత్పత్తుల పరిశ్రమను నిర్వహిస్తూ, వెంకీస్, వెన్ కాబ్ వంటి పలు బ్రాండ్లను మార్కెటింగ్ చేస్తోన్న వెంకటేశ్వర హేచరీస్ లో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.