సుప్రీం తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: తమిళుల మండిపాటు
- నీటి వాటాలో కోతపై తమిళ సంఘాల స్పందన
- ఉన్న వాటా తగ్గించడంపై విమర్శలు
- 15 టీఎంసీలను తగ్గించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీరు వచ్చే పరిస్థితి కావేరీ నదిలో గత నాలుగేళ్లుగా లేదని చెబుతూ, ఎగువన ఉన్న కర్ణాటకకు నీటిలో వాటాను పెంచడం వల్ల వస్తున్న ఆ కొద్ది నీరు కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. 2007లో అప్పటి ట్రైబ్యునల్ తమిళనాడుకు 192 టీఎంసీలు, కర్ణాటకకు 184.75 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే.
కాగా, తమిళనాడు సర్కారు తమకు నాటి ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 192 టీఎంసీల నీరు కావాలని సుప్రీంలో కోరితే, అందులో సుమారు 15 టీఎంసీలు తక్కువగా కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.