నీరవ్ మోదీని వదిలించుకోవడం ఎలా? ఆలోచనలో పడిన ప్రియాంకా చోప్రా!
- బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టిన నీరవ్ మోదీ
- ఆయనతో జనవరి 2017 నుంచి ప్రియాంకా చోప్రా డీల్
- కుంభకోణం వెలుగులోకి రావడంతో న్యాయ నిపుణుల సలహా కోరిన ప్రియాంక
"నీరవ్ మోదీపై ప్రియాంకా చోప్రా దావా వేసిందని, కేసు పెట్టిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఇదే సమయంలో ఆమె గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఎలా వదిలించుకోవాలో ప్రయత్నిస్తున్నారు. లాయర్ల సలహాను ఇప్పటికే కోరారు. నీరవ్ పై ఆర్థిక కుంభకోణం ఆరోపణలు రావడమే ఇందుకు కారణం" అని ఆ ప్రకటనలో ఉంది. కాగా, జనవరి 2017 నుంచి నీరవ్ మార్కెటింగ్ చేస్తున్న వివిధ రకాల ఆభరణాలకు ఈ 'క్వాంటికో' క్వీన్ ప్రచారం సాగిస్తోంది.