మాల్దీవుల విషయంలో భారత్ను మరోమారు హెచ్చరించిన చైనా
- భారత్ పేరెత్తకుండానే డ్రాగన్ కంట్రీ హెచ్చరికలు
- సమస్య వారి అంతర్గత వ్యవహారమన్న చైనా
- ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసని వ్యాఖ్య
‘‘మాకు తెలిసినంత వరకు మాల్దీవుల్లో నెలకొన్న ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోగల సమర్థత ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ఉంది. చట్టప్రకారం సమస్యలను పరిష్కరించుకుని మునుపటి పరిస్థితులను పునరుద్ధరించుకుంటారు’’ అని చైనా ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిష్కారానికి నషీద్ భారత సాయాన్ని అర్ధించారు. అంతేకాదు.. తమ దేశ భూములను చైనా ఆక్రమించిందని, ఆర్కిపెలాగోలో 17 దీవులు చైనా అధీనంలో ఉన్నాయని ఆరోపించిన నషీద్.. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో చైనా తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.