పీఎన్బీకి 280 కోట్లకు టోకరా వేసిన వజ్రాల వ్యాపారి... సీబీఐ కేసు!
- వజ్రాల వ్యాపారికి సహకరించిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు
- ఎలాంటి పూచీకత్తు, పత్రాలు లేకుండా 280.7 కోట్ల రుణం మంజూరు
- ఈ మొత్తానికి బ్యాంకులో రికార్డులు కనిపించకుండా చేసిన బ్యాంకు ఉద్యోగులు
ఈ నలుగురితో బ్యాంకు రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాథ్, మరో అధికారి మనోజ్ కరత్ లు కుమ్మక్కై గత ఏడాది పంజాబ్ నేషనల్ బ్యాంకులో 280.7 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి పూచీకత్తు, నిర్ణీత పత్రాలు లేకుండా మంజూరు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి రికార్డు బ్యాంకు సిస్టమ్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిని గుర్తించిన ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించగా ఇంటిదొంగలతో కలిసి చేసిన గోల్ మాల్ బయటపడింది. వీరికి జారీ చేసిన ఎల్ఓయూలు కూడా నకిలీవని తేలడంతో బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సీబీఐ దర్యాప్తుకు అప్పగించారు.