Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 215 సీట్ల కన్నా తక్కువే వస్తాయి: సీఎం కేజ్రీవాల్

  • కొన్ని రోజుల క్రితం కొంత మంది నన్ను కలిశారు
  • ఇదే విషయాన్ని వారూ చెప్పారు
  • నిరుద్యోగ సమస్యతో యువత సతమతమవుతోంది
  • బీజేపీ తీరుతో మధ్య తరగతి ప్రజలు విసిగిపోయారు: కేజ్రీ ట్వీట్
వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి 215 స్థానాలకు మించి రావని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం కొంత మంది తనని కలిశారని, ఇదే విషయాన్ని వారందరూ ఏకాభిప్రాయంగా చెప్పారని అన్నారు. నిరుద్యోగం అనే పెద్ద సమస్యతో యువత సతమతమవుతోందని, తమ భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నారని, బీజేపీ తీరుతో మధ్య తరగతి ప్రజలు విసిగిపోయారని ఆ ట్వీట్ లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. 
Arvind Kejriwal
aam admi party
bjp

More Telugu News