రెండో ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా... యుద్ధ భయంతో వణుకుతున్న జపాన్!
- దశాబ్దాల తరువాత మిలటరీ డ్రిల్
- క్షిపణి దూసుకొస్తోందని మైకుల్లో ప్రకటన
- ప్రజల్లో అవగాహన కోసమేనన్న జపాన్
అక్కడున్న వారందరికీ "మిసైల్ దూసుకొస్తోంది. మిసైల్ దూసుకొస్తోంది" అని కేకలు పెడుతూ పోలీసులు పరుగులు పెట్టారు. ప్రతి ఒక్కరూ భవనాల్లోకి, భూగర్భ గృహాల్లోకి, పక్కనే ఉన్న సబ్ వే రైల్వే స్టేషన్ లోకి నిదానంగా వెళ్లిపోవాలని సూచించారు. ఆపై కొన్ని నిమిషాల తరువాత, మిసైల్ గ్రేటర్ టోక్యో రీజియన్ దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిపోయిందన్న అనౌన్స్ మెంట్ వినిపించింది. కాగా, ఇంతవరకూ జపాన్ లో భూకంపం వస్తే ఎలా తప్పించుకోవాలన్న విషయంలోనే ప్రజల్లో అవగాహన పెంచేందుకు తరచూ మిలిటరీ డ్రిల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు అణు యుద్ధం ముప్పు కూడా పొంచి వుండటంతో, నగరంలో మరిన్ని భూగర్భ గృహాలను నిర్మిస్తోంది.